Thursday, November 13

అయ్యప్ప స్వామి దీక్ష / మాల ధారణ

ఈ సమయం లో నల్లని పంచలు, మెడ లో రుద్రాక్ష మాలలు, నుదుట గంధం విభూది ల తో మనకు అయ్యప్ప భక్తులు కనిపిస్తారు. 40 రోజుల దీక్ష తీస్కోని, అయ్యప్ప ని పూజించే భక్తులను మనం "స్వామి " గా సంభోదిస్తాం. ఈ అయ్యప్ప దీక్ష అనునది మళయాళ నెలల లో వృశ్చికం ( నవంబర్ 14/15/16 ) నుండి మొదలవుతుంది. మండల పూజ
( సుమారు25 dec ), మకర సంక్రాంతి ( సుమారు 14jan ) ఈ రెండు రోజలలో అయ్యప్ప స్వామి దర్శనం చేస్కొంటారు. ఈ రెండు రోజలలో మకర సంక్రాంతి రోజు దర్శనం ప్రదానమైనది. ఆ రోజు జ్యోతి దర్శనం జరుగుతుంది. జ్యోతి రూపం లో అయ్యప్ప భక్తులకు దర్శనం ఇస్తారు.
శబరిమల ఆలయం, మళయాళ నూతన సంవత్సర మొదటి రోజు, ప్రధాన పండగల రోజు తెరుస్తారు. ఉదా : ఓనం, విశు. 41రోజుల దీక్ష తప్పనిసరిగా తీస్కొని అయ్యప్ప దర్శనం చేయవలెను. ఈ అయ్యప్ప దీక్ష అనునది తల్లి ద్వారా కానీ, గురువుగారి ద్వారా కాని, గురుస్వామి ద్వారా కానితీస్కొనవలెను. ఆ రుద్రాక్ష మాల మెడలో పడిన దగ్గర నుండి " స్వామి " అని అందరి చేత పిలువబడుతాడు. అమ్మాయిలు ఈ దీక్ష తీసుకోడానికి నిబంధనలు ఉన్నాయి. అమ్మాయి 1 -9 వయస్సు లోపు వారు, 50 వయస్సు దాటినా వారు దీక్షకు అర్హులు. దీక్ష తీసుకొన్న ఆడువారిని "మాలికాపురం" గా పిలుస్తారు. ( అయ్యప్ప యొక్క శక్తి స్వరూపం).
దీక్ష తీసుకొన్న వారు ఖచ్చితంగా నియమ నిభంధనలను పాటించాలి. తెల్లవారక ముందే లేచి, చన్నీటి స్నానం చేసి, శరణు ఘోష చేసి, నైవేద్యం పెట్టాలి. చెప్పులు, బూట్లు ధరించకూడదు. నలుపు / కాషాయం రంగు మాత్రమే ధరించాలి. జుట్టు కత్తిరింపు, ధూమపానం, మందు తాగటం, మాంసాహారం భుజించడం చేయకూడదు. బ్రహ్మచర్యం తప్పకుండ పాటించాలి. వేరే వారిని పిలిచేటప్పుడు కూడా స్వామి అనే సంభోదించాలి. ఈ నియామాలు పాటించకుండా శబరిమల దర్శనం వ్యర్ధం.
" ఓం హరిహర సుతన్ ఆనంద చిత్తన్ అయ్యన్ అయ్యప్ప స్వామియే శరణం అయ్యప్ప "

Sunday, November 9

గురుశ్లోకం

గురుబ్రహ్మ గురువిష్ణుర్గురుర్దేవో మహేశ్వరః
గురుసాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః

గురుః --- శ్రీ సద్గురువు , బ్రహ్మ --- బ్రహ్మదేవుడు , గురుః --శ్రీ గురుమూర్తి , విష్ణువు --- విష్ణువు, గురుః -- శ్రీగురుదేవుడు, దేవః..దేవుడగు, మహేశ్వరః--ఈశ్వరుడు, గురుః--శ్రీగురువర్యుడు, సాక్షాత్పరబ్రహ్మ --- ప్రత్యక్షమైన పరబ్రహ్మము, తస్మై--అటువంటి, శ్రీగురవే--శ్రీసద్గురువు కు, నమః--నమస్కారము.

చతుర్వేద సారములను భోదించుటచే శ్రీగురుదేవుడు చతుర్ముఖములతో చతుర్వేదములను ఉపదేశించు బ్రహ్మదేవుడై ఉన్నాడు.
జ్గ్యాన భోదనలు చేసి ఆజ్గ్యానములోకి పడనీయకుండా అందరిని రక్షించిన వాడగుటచే శ్రీగురుదేవుడు విష్ణువై ఉన్నాడు.
శరణు వేడిన వారికి సకల అజ్గ్యానములను హరింప చేస్తునాడు కావున శ్రీగురుదేవుడు సకల జగములను లయ మొనరించు మహేశుడై ఉన్నాడు.
త్రిగుణాతీతమగు ( సత్వ, రజ, తమో గుణాలు ) బ్రహ్మతత్వం అగుటచే శ్రీగురువు సాక్షాత్ పరబ్రహ్మమై ప్రకాశించుచున్నాడు. అట్టి గురుదేవునకు నా నమస్కారము.