రామాయణ కాలం లో ఉత్తరాయణం మొదటి రోజును ఉగాదిగా జరుపుకొనే వారు. కొద్దికాలం తర్వాత వరాహమిహిరుడు అనే మహర్షి చైత్రశుద్ద పాడ్యమి నాడు ఉగాది ని జరపడం ప్రారంబించారు. అప్పటినుండి అదే ఆనవాయితి గా మారింది.
ఉగాది పచ్చడి. పంచాంగ శ్రవణం ఈ పండగ ప్రత్యేకత. పొద్దునే లేచి, తలంటు స్నానాలు చేసి, పూజ జరిపి, ఉగాది పచ్చడి తింటే కాని మరేది తినం. అలాగే పంచాంగం వింటాం. రాశిఫలాలు ఎలా ఉన్నాయి, పంటలు, వర్షాలు మొదలైన వాటి గురించి తెల్సుకొంటాం.

షడ్రుచుల కలయకే ఉగాదిపచ్చడి. (బెల్లం/తీపి, వేప పువ్వు /చేదు, మిరపకాయ/కారం, చింతపండు/పులుపు, మామిడికాయ/వగరు, ఉప్పు) మన జీవితం లో వచ్చే ఎగుడు/దిగుడులు, శుఖ సంతోషాలను ఒకేలా తీసుకోవాలని ( సంతోషం వచ్చినపుడు పొంగిపోయే, దుఖం వస్తే కుంగిపోవడం లా కాకుండా ) ఈ ఉగాది పచ్చడి లో ని అంతరార్ధం.
0 వినదగు నెవ్వరు చెప్పిన..:
Post a Comment