Monday, January 12

మకర జ్యోతి

శబరిమల ఆలయానికి మకరవిల్లకు పండుగ చాల ముఖ్యమైనది . మకరసంక్రాంతి నుండి 7 రోజులు ఈ పండుగ జరుపుతారు .

మకరసంక్రాంతి కంటే 3 రోజుల ముందు పండ
Jewelbox of Swamy Ayyappaలం అను ప్రాంతం లో ఉన్న వలియ కోయిక్కల్ శాస్త ఆలయం నుండి స్వామి వారి ఆభరణాలు తెస్కొని వస్తారు. ఆభరణాల పెట్టెను మోస్తున వ్యక్తి స్వామి నామస్మరణతో పారవశ్యం చెందుతూ , మద్యలో కొన్ని దేవాలయాల ముందు ఆగుతూ , శబరిమల చేరుతారు . సాయం సంధ్య వేళలో దీపాల వెలుగులో , బాజా బజంత్రీ లతో , స్వామి ఆభరణాలను సన్నిధానం లో కి చేరుస్తారు .ఆ సమయలో ఆకాసంలో ఒక గద్ద ఆ పెట్టె చుట్టూ ఓ ప్రదక్షణ చేసి వెళ్ళిపోతుంది .

చీకటి పడే వేళకి, భక్తుల చూపు అంతా ఉత్తర -తూర్పు దిక్కుల మధ్యకి కేంద్రీకృతం అవుతుంది . అది మకర జ్యోతి ఆస్సన్నం అయ్యే సమయం .జ్యోతి దర్శనం ....శరణు ఘోష తో శబరిమల మారు మ్రోగి పోతుంది . భక్తుల కి చెప్పలేని సంతోషం , ఆనందం . ఆ జ్యోతి ని కళ్లారా చూసి జన్మ తరింప చేస్కొంటారు .




మనిమందపం దగ్గర , మెట్ల పూజ నిర్వహిస్తారు . పూజ తర్వాత మాలికాపురతమ్మ ఏనుగు అంబారి పైన , మేళ్ళ తాళాలతో పతినేట్టంపడి గుండా ప్రధాన ఆలయం చేరుతుంది .



7 రోజుల ఉత్యవాలు "గురుతి "అనే ఉత్యవం తో ముగుస్తాయి .

0 వినదగు నెవ్వరు చెప్పిన..: