Wednesday, April 20

దశ మహావిద్యలు

మొదటిరూపం కాళి : మహాకాళి సమస్త విద్యలకు ఆది. ఆమె యొక్క విద్యామయ విభూతలనే మహావిద్యలంటారు. ఒకానొక సమయంలో హిమాలయములందు కల మతంగ మున్యాశ్రమమునందు దేవతలు మహామాయను స్తుతించిరి. అంబిక మతంగ వనితా రూపమున దర్శనమిచ్చింది. కాటుక వలె కృష్ణవర్ణమునందు ఉండుటవలన ఆమెకు కాళీ అనే పేరు వచ్చింది. శుంభనిశుంభలను సంహరించినది. కాళి నీలరూపము అగుటవలన తారానామము ఏర్పడినది. అనేక సంవత్సరాల కాలమునకు కాని ఫలించని యోగమార్గ సాధన, కొద్ది రోజులలోనో, మాసములలోనో సాధించాలి అని అనుకొనే వారు కాళి ఉపాసన చేస్తారు. ఐతే సాధనాకలం లో కాళీ శక్తి తమ శరీరములోకి ఆకర్షించినపుడు యోగి దుర్భరమైన అగ్ని సదృశమైన మంటలను, బాధలను అనుభవించాల్సి ఉండును.

రెండువరూపం తార : తార సర్వదా మోక్షమును ప్రసాదించును. ఈమెకు నీలసరస్వతి అను పేరు కూడా ఉంది. భయంకరమైన విపత్తులనుండి భక్తులను కాపాడుతుంది కావున, ఈమెను ఉగ్రతార రూపమున కూడ యోగులు ఆరాధిస్తారు. వశిష్ఠ మహర్షి గొప్ప తారా ఉపాసకుడు. చైత్రశుద్ధ నవమి రాత్రిని తారారాత్రి అని పిలుస్తారు. బుధగ్రహ దోషం ఉన్నవారు కి ఈ అమ్మవారి ని పూజిస్తే మంచి ఫలితం ఉంటుంది.

మూడవరూపం ఛిన్నమస్త : దేవి ఒకానొక సమయమున తన సఖురాండ్రైన జయవిజయలతో మందాకిని నదికి స్నానార్ధము వెల్లింది. స్నానము చేసిన తదుపరి ఆమె క్షుధాగ్ని పీడితయై కృష్ణవర్ణ ఐనది. ఆమె సఖురాండ్రు ఆమెను భోజనవిషయమై అడిగిరి. కృపామయురాలు అయిన దేవి ఖడ్గముతో తన శిరస్సును ఖండించుకొనగా ఖండిత శిరస్సు ఆమె వామ హస్తమున పడింది. ఆమె కబంధం నుండి మూడు రక్తధారలు ప్రవహించినవి. రెండు రక్తధారలను ఆమె సఖురాండ్రు పానము చేయగా మూడవ రక్తధారను దేవియే స్వయముగా పానము చేసినది. ఆ రోజునుండి ఆమెకు ఛిన్నమస్తా నామము స్థిరపడినది. హిరణ్యకశ్యపాదులు ఈ ఛినమస్తాదేవి ఉపాసకులు.

నాల్గవరూపం షోడసీ : ఈ తల్లి చాలా దయామయురాలు. ఈమెను ఆశ్రయించినవారికి ఙ్ఞానమనునది కరతలామలకము. విశ్వములోని మంత్రతంత్రాదులన్ని ఈ అమ్మవారినే ఆరాధిస్తాయి. ఈమెను వేదములు కూడ వర్ణింపజాలవు. ప్రసన్నురాలైన ఈ మహాశక్తి ఉపాసన వలన భోగమోక్షములు రెందూ సిద్ధిస్తాయి. బుధగ్రహ దోషం ఉన్నవారు కి ఈ అమ్మవారి ని పూజిస్తే మంచి ఫలితం ఉంటుంది.

ఐదవరూపం భువనేశ్వరీదేవి : సమస్తకోటి మహామంత్రములు ఎల్లపుడు ఈ దేవిని ఆరాధిస్తూ ఉంటాయి. కాళీతత్వము నుండి నిర్గతమై కమలాతత్వ పర్యంతం దశస్థితులు ఉన్నయి. వాటినుండి అవ్యక్త భువనేశ్వరీ వ్యక్తమై బ్రహ్మాండరూపాన్ని ధరించకలుగుతుంది. ప్రళయవేళలో జగత్తునుండి క్రమముగా లయమై కాళీరూపములో మూలప్రకృతిగా మారుతుంది. అందుచేతనే ఈ తల్లిని కాలుని జన్మదాత్రి అని కూడా అంటారు. చంద్రగ్రహ దోషం ఉన్నవారు కి ఈ అమ్మవారి ని పూజిస్తే మంచి ఫలితం ఉంటుంది.

ఆరవరూపం త్రిపురభైరవి : సృస్టిలో పరివర్తన అనునది ఎల్లపుడునూ జరుగుతూనే ఉంటుంది. దీనికి ఆకర్షణ, వికర్షణ అనునవే మూలకారణము. ఈ త్రిపురభైరవి నృసిం హభగవానుడి అబ్బిన్నశక్తిగా చెప్పబడినాడు.

ఏడవరూపం ధుమావతి : ఈమె కూడ ఉగ్రరూపమే. ఆగమములలో ఈమెని అభావసంకటాలను దూరం చేయునట్టి రూపంగా వర్ణించారు. ఐతే జీవుని దైన్యావస్థలైన క్షుత్పిపాసలూ, కలహదారిద్ర్యముల న్నింటికి ఈమే కర్త. ఆమె అనుగ్రహముంటే సకటములన్నీ దూరమవుతాయి. రాహుగ్రహ దోషం ఉన్నవారు కి ఈ అమ్మవారి ని పూజిస్తే మంచి ఫలితం ఉంటుంది.

ఎనిమిదవరూపం భగళాముఖి : ఐహిక, దేశ, సమాజ, శత్రు శమనార్ధం ఈ తల్లిని ఆరాధిస్తూ ఉంటారు. ప్రధమముగా బ్రహ్మదేవుడు భగళామహా విద్యోపాసన చేసాడు. విష్ణువు, పరశురాముడు భగళాముఖీ దేవతా ఉపాసకులే. కుజ దోషం ఉన్నవారు ఈ అమ్మవారి పూజ చేయడం మంచిది.

తొమ్మిదవరూపం మాతంగి : గృహస్థజీవితాన్ని సుఖవంతంచేసి పురుషార్ధములను సిద్ధింపచేసే శక్తి ఉన్న రూపం. ఈమెను మతంగముని కుమార్తెగా కూడా పిలుస్తారు.

పదవరూపం కమలాలయ : వస్తు సమృద్ధికి ప్రతీక. భార్గవులచేత పూజింపబడుట వలన ఈమెకు భార్గవి అనే పేరు కూడ ఉంది. శుక్రగ్రహ దోషం ఉన్నవారు ఈ అమ్మవారి పూజవలన ఫలితాన్ని పొందుతారు

0 వినదగు నెవ్వరు చెప్పిన..: