
ఇక వ్రత విషయానికొస్తే, ఒక మండపాన్ని ఏర్పాటు చేసుకోవాలి. అందులో 7 పడగలు కల (14 పడగలు చేస్తరు కొందరు) అనంతుడిని దర్భలతో చేసి ప్రతిష్టిస్తారు. ముందుగా గణాధిపతిని పూజించాలి. కలిశంలో సిద్ధం చేసుకొన్న పవిత్ర జలములకి "యమున పూజ" చేయాలి అంటే యమునా నదిని ఆవహన చేయడం. తరువాత అనంతుడికి షోడశోపచారాలతో పూజచేసి బెల్లము, నేతితో చేసిన 28 అరిసెలను నైవేద్యముగా పెట్టాలి. వ్రత కథ చదువుకొని, తోరాన్ని కట్టుకోవాలి. ఎరుపు రంగులో 14 పోచలతో తోరాన్ని ముందుగా సిద్ధం చేసుకోవాలి.
ఈ అనంత వ్రతంలో మనకు స్పష్టముగా తెలిసేది 14 కి చాల ప్రాముఖ్యం ఉంది అని. అవి
14 లోకాలను ఏలే వాడు కనుకనే ఈ వ్రతంలో 14 లేక 7 పడగలు కల అనంతుడిని ప్రతిష్ట చేసి పూజిస్తారు
14 కి రెండింతలైన 28 సంఖ్యలో పిండివంటలను నైవేద్యం పెట్టడం
14 ముడులు కల తోరాన్ని ధరించడం
14 సంవత్సరలకి ఒకసరి ఉద్యాపన చేయడం.
ఏడేడు పద్నాలుగు లోకాలను ఏలే ఆ దివ్యమంగళ స్వరూపాన్ని తలచుకోడం కోసమే ఈ వ్రతం. ఈ వ్రతాన్ని పురోహితుడి ద్వార వివరంగా తెలుసుకొని చేయడం మంచిది.
0 వినదగు నెవ్వరు చెప్పిన..:
Post a Comment