Wednesday, May 11

పరశురాముడు


జమదగ్ని మహర్షి, రేణుకల కుమారుడు పరశురాముడు. కోపము, ఆవేశము ఎక్కువ. ఏ కార్యం తలపెట్టిన వెనుతగ్గే సమస్యే లేదు, విజేయుడై వస్తాడు. ఒకసారి హైహయ వంశీయుడైన కార్తవీర్యార్జునుడు, వేటలో అలసిపోయి, తన సేనతో జమదగ్ని ఆశ్రమానికి చేరుతాడు. మహర్షి రాజుకు, వారి పరివారానికి పంచభక్ష పరమాన్నలతో భోజనం పెట్టాడు. మహర్షి కామధేనువు సాయంతో ఇంతమందికి లోటులేకుండా భోజనాలు పెట్టాడు అని తెలుసుకొన్న రాజు, ఆ ధేనువును తనకు ఇమ్మని మహర్షిని అడిగాడు, అందుకు జమదగ్ని ఒప్పుకోకపోవడంతో బలవంతంగా ధేనువుని తీసుకొనివెళ్ళిపోయాడు.

పరశురాముడు తన తండ్రిని అవమానించిన కార్తవీర్యార్జునిడిని సం హరించి, తిరిగి కామధేనువును ఆశ్రమానికి తెస్తాడు. కొద్దికాలం తరువాత మరొక సంఘటన జరిగింది.

తల్లి రేణుకా నీరు తేవడానికి సరస్సుకి వెళ్ళింది. అదే సమయంలో అప్సరసలతో చిత్రరధుడు క్రీడిస్తున్న దృశ్యం చుసి అలాగే ఉండిపోయినది. దివ్యదృష్టితో ఈ విషయం తెలుసుకొన్న జగమదగ్ని, తల్లిని వదించమని కుమారులను ఆఙ్ఞాపించాడు. అందుకు వారు నిరాకరించారు. కుమారులలో ఒకడైన పరశురాముడిని, తన మాట ధిక్కరించిన సోదరులను, మనోవికారానికి గురైన తల్లిని సంహరించమని ఆఙ్ఞాపించాడు, తండ్రి మాట శిరసావహించిన పరశురాముడిని వరం కోరుకోమంటాడు జమదగ్ని. తన తల్లిని, సోదరులను తిరిగి బ్రతికించమని వేడుకొంటాడు పరశురాముడు. జమదగ్ని పుత్రుడి కోరికను నెరవేరుస్తాడు. ఇలా కొంతకాలం గడిచింది.

ఒకనాడు పరశురాముడు ఆశ్రమంలోలేని సమయంలో, కార్తవీర్యార్జుని కుమారులు జమదగ్నిని సంహరించి వెళ్తారు. విషయం తెల్సిన పరశురాముడు, తన తండ్రిని రాకుమారుడు సంహరిచినందుకు ప్రతీకారంగా ఈ భూమండలమందు రాజులను బ్రతకనివ్వనని ప్రతిఙ్ఞ చేసాడు.

పరశురాముడు యావత్ క్షత్రియ జాతిపై ఆగ్రహించి వారిపై 21 మార్లు దండెత్తి క్షత్రియవంశాలను నాశనం చేశాడు. శ్యమంతక పంచకమనే 5 సరస్సులను క్షత్రియుల రక్తంతో నింపి పరశురాముడు తల్లిదండ్రులకు తర్పణం అర్చించాడు. దశరథునివంటి కొద్దిమంది రాజులు గోవుల మందలలో దాగుకొని తప్పుకొన్నారు. తరువాత పరశురాముడు భూమినంతటినీ కశ్యపునకు దానమిచ్చి తాను తపస్సు చేసుకోవడానికి వెళ్ళిపోయాడు.
భూమినంతటినీ కశ్యపునకు దానమిచ్చిన తరువాత పరశురామునికి తపస్సు చేసికోవడానికి చోటు లేదు. ఆయన తన పరశువును సముద్రంలోకి విసిరేయగా, ఆయనపై గౌరవంతో అంతవరకు సముద్రుడు వెనుకకు తగ్గాడు. అలా వెలువడిన భూభాగమే నేటి కేరళ అని నమ్మిక. ఇలా వెలువడ భూమి లో గల 7 ప్రదేశాలను పరశురామక్షేత్రాలు అని అంటారు.

కేరళలో తిరువనంతపురం దగ్గర, తిరువళ్ళంలో కరమణ నది ఒడ్డున ఒక పురాతనమైన పరశురామ మందిరం ఉన్నది. ఇది 2వేల సంవత్సరాలనాటిదంటారు. ఇక్కడ పితృదేవతలను పూజించడం ఆచారం.

0 వినదగు నెవ్వరు చెప్పిన..: