Friday, May 13

రామావతారం


తల్లితండ్రుల మాటను తూచా తప్పకుండా పాటించే ఒక సామాన్యుడిగా రూపం దాల్చి, రావణాసురుడు వంటి రాక్షసులను సంహరించి, సీతా మహాసాధ్వితో అయోధ్యాదీసుడైనాడు రాముడు. అన్న మాటే వేదంగా శిరసావహించే తమ్ముడు లక్ష్మణుడు,, అన్న పాదారక్షలనే సింహాసనం పైన ఉంచి పాలనను సాగించిన తమ్ముడు భరతుడు, శత్రుఘ్యుడు.

మందర మాట విని కైకేయి, శ్రీరామునికి బదులు తన కుమారుడు భరతుడికి పట్టాభిషేకం చేయమని, రాముడిని 14 ఏళ్ళ వనవాసం పంపమని దశరధ మహారాజుని కోరింది. పినతల్లి మాటకు కట్టుబడి, రాముడు, సీతా లక్ష్మణ సమేతుడై వనవాసం తలపెట్టెను. వనవాస సమయంలో లంకేయుడూ, మహేశ్వరుని అపర భక్తుడూ అయిన రావణాసురుడు, సీతమ్మ తల్లిని అపహరించి లంకలో అశోకవనములో ఉంచుతాడు. అపహరన తగదని రావణుడి తమ్ముడు విభీషణుడు, భార్య మండోదరి రాముడి గొప్పతనమును రావణుడికి చెప్పినను రావణుడు లెక్కచేయక, ఆ శ్రీరామచంద్రుడితోనే వైరంకి దిగాడు. రామయ్య వానరసేనతో, లంక పైన దాడి చేసి, రావణ సంహారమొనరించి, సీతమ్మతల్లిని తన దరికి చేర్చుకొంటాడు.

ఇంత గొప్ప రామాయణంలో హనుమంతుడి యొక్క స్వామిభక్తి, లక్ష్మణుడి యొక్క సోదరభావం, సీతమ్మ పతిభక్తి, శబరి తల్లిప్రేమ, గుహుడు, వారధి కట్టే సమయంలో ఉడత భక్తి ఇలా ఒక్కొక్కరు ఒక్కోరూపంలో తమ భక్తిని చాటుకొన్నారు.

"శ్రీ రాఘవం దశరధాత్మజ మప్రమేయం

సీతాపతిం రఘుకులాన్వయ రత్నదీపం

ఆజానుబాహుం అరవింద ళాయతాక్షం
రామం నిసాచరవినాశకరం నమామి"

0 వినదగు నెవ్వరు చెప్పిన..: