Friday, May 13

కృష్ణావతారం


"వసుదేవ సుతం దేవం కంస చాణూరమర్ధనం
దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం "

మథుర లో దేవకీవసుదేవుల బిడ్డగా పుట్టి, రేపల్లెలో యశోదానందుల ముద్దులకొండగా, బలరాముడు, సుభద్ర ల సోదరుడిగా, కన్నయ్య గా మన అందరిచేత ముద్దుగా పిలిపించుకొంటున్న విష్ణుమూర్తి యొక్క 9వ అవతారం శ్రీకృష్ణుడు. కౌరవలచేత పాండవపక్షపాతిగా పేరుపడ్డాడు. కృష్ణవర్ణం అంటే నీలం, నలుపు, చీకటి అనే అర్ధాలు ఉన్నాయి, ఙ్ఞానానికి ప్రతీక నీలం. అందుకే ఆ విష్ణుమూర్తి నీల మేఘశ్యాముడైనాడు.



"కస్తురీ తిలకం లలాటఫలకే వక్షస్థలే కౌస్తుభం
నాసాగ్రే వరమౌక్తికం కరతలే వేణుం కరే కంకణం.
సర్వాంగే హరిచందనం చ కలయన్ కంఠే చ ముక్తావళి
గోపస్త్రీ పరివేష్టితో విజయతే గోపాల చుడామణిః "

పాలుత్రాగే ప్రాయంలో తనను చంపటానికి కంసునిచే పంపబడిన పూతనను, బుడిబుడి నడకల ప్రాయంలో శకటాసురాదులను సంహరించాడు. కాళిందిలో ఉన్న కాళీయుడి తలపై నృత్యముచేసి "తాండవకృష్ణుడు" అయ్యాడు. ప్రళయకాలంలో గోవర్ధన గిరిని తన చిటికెన వేలుతో ఎత్తి రేపల్లె వాసులను ఆ గిరి కిందకు చేర్చికాపాడి రేపల్లె వాసుల మనసుల్లో భగవంతుడి స్థాయికి ఎదిగాడు. అల్లరి పనులతో అలరించి, ఆపత్కాలంలో ఆదుకుని, ధైర్యసాహసాల ప్రదర్శనతో రేపల్లెను మురిపించి కంసునిచే పంపబడిన ఉద్దవుని రాకతో మధురకు చేరి తనను మాయోపాయయంచే చంపచూసిన కంసుని వధించి తన తాత ఉగ్రసేనుని చెర విడిపించి అతనిని రాజ్యాభిషిక్తుని గావించి చెరలోఉన్న తల్లి, తండ్రులను వారితో విడిపించి ద్వారకకు చేరుకుంటాడు. విద్యాభ్యాసానికి ముని ఆశ్రమము చేరుకొని అక్కడ కుచేలుని చెలిమిని పొంది, గురుదక్షిణగా తక్షకుడు తస్కరించిన అధిథి కుండలాలను విడిపించి గురువుకి సమర్పించి విద్యాధనంతో తన తల్లి తండ్రులవద్దకు చేరుకుంటాడు.
కృష్ణుని అష్టభార్యలు - రుక్మిణి, సత్యభామ, జాంబవతి, కాళిందిని, భధ్ర, నాగ్నజితి, మిత్రవింద మరియు లక్షణ
వనవాస సమయంలోను, కురుక్షేత్ర యుద్దంలోను పాండవులకు అండగా ఉండి, అర్జునుడికి "గీత" ను భోధించిన జగన్నాటకసూత్రధారి ఆ గోపాలపాలకుడు.

శ్రీమధ్బాగవత పఠన సంప్రదాయాన్ని మొట్టమొదట ప్రారంభించినవారు వ్యాసమహర్షి పుత్రుడు శుకమహర్షి, పరీక్షిత్ మహారాజుకి 7రోజులపాటు భాగవతాన్ని వినిపించాడు. శ్రీకృష్ణుని నిర్యాణం జరిగిన 30ఏళ్ళ తరువాత కలియుగం ప్రవేసించిన భాద్రపద శుద్ధనవమి నుండి పౌర్ణమి దాక తొలి భగవత సప్తాహం జరిగింది.

2 వినదగు నెవ్వరు చెప్పిన..:

RAM MOHAN RAJU said...

Vanavasa samayamlonu, Kurukshtra yuddham lonu pandavulaku andaga undi, krishnudiki geethanu bodhinchi ani porapatuga mudrincha padinatlundi.. arjunidiki gaathanu bodhinchina jagannataka suthradhari aa gopalapalakudu..

గాయత్రి said...

రాజు గారు, పొరపాటును సవరించితిని. ధన్యవాదములు